Header Banner

ఏపీలో వారందరికీ కొత్త పింఛన్లు! జూన్ నుండే రూ.4 వేలు .. డేట్ ఫిక్స్!

  Thu May 29, 2025 09:25        Politics

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ దారులకు శుభవార్త తెలిపింది. ఇకపై భర్త చనిపోయిన భార్యలకు కూడా పింఛన్ ఇవ్వాలని నిర్ణయించింది. దీనికోసం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఎన్డీయే ప్రభుత్వం స్పౌజ్ పింఛను పథకాన్ని ప్రారంభించింది. జూన్ 12న రాష్ట్ర ప్రభుత్వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పింఛన్ డబ్బులు పంపిణీ చేస్తారు. అయితే, కొన్ని కారణాల వల్ల దరఖాస్తులు తిరస్కరించబడతాయి. పూర్తి వివరాల కోసం మీ గ్రామ సచివాలయాన్ని సంప్రదించండి.

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్‌లకు సంబంధించి మార్పుల్ని తీసుకొచ్చింది. ప్రతి నెలా ఒకటో తేదీన పింఛన్ మంజూర్ చేయడంతో పాటుగా దివ్యాంగులైన విద్యార్థులకు అకౌంట్‌లలో పింఛన్ డబ్బుల్ని జమ చేస్తోంది. అలాగే ఒకటో తేదీ సెలవు దినం అయితే.. ముందురోజే పింఛన్ పంపిణీ చేస్తోంది. అలాగే స్పౌజ్ కేటగిరిలో పింఛన్‌లకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో పింఛను తీసుకుంటూ మరణించిన వారి భార్యలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనుంది.

 

ఇది కూడా చదవండి: అమరావతికి మరో ఇన్నర్ రింగ్ రోడ్డు రూ. 48 కోట్లతో..! ఈ రూట్‌లోనే, పనులు ప్రారంభం!

 

ఈ మేరకు ప్రభుత్వం 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 మధ్య మరణించిన వారి భార్యలకు స్పౌజ్ పింఛను కింద నెలకు రూ.4,000 ఇవ్వనున్నారు. వచ్చే నెల నుంచి వారికి ఈ డబ్బులు అందజేస్తారు. సుమారు 89,788 మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. ఈ పథకం ద్వారా ప్రభుత్వంపై నెలకు రూ.35.91 కోట్ల అదనపు భారం పడుతుంది. జూన్ 12న రాష్ట్ర ప్రభుత్వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లబ్ధిదారులకు పింఛను ఈ పింఛన్ డబ్బులు పంపిణీ చేస్తారు.


గత ప్రభుత్వం వితంతువు పింఛన్ల మంజూరును ఆపివేసింది.. ఆ తరువాత ఎన్నికలు రావడంతో ఈ సమస్య పరిష్కారం కాలేదు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ విషయంపై దృష్టి సారించింది. భర్త చనిపోతే ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాయని ప్రభుత్వం గుర్తించింది. అందుకే వారికి సహాయం చేయాలని నిర్ణయించింది. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి లబ్ధిదారుల జాబితాను పంపించారు. అర్హులైన వారి నుంచి పత్రాలు స్వీకరించి సెర్ప్‌ వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని అధికారులు ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పింఛనుకు అర్హులైన వారి జాబితాను తయారు చేశారు. కూటమి ప్రభుత్వం గత నెల 24న స్పౌజ్ పింఛను పథకాన్ని ప్రారంభించింది. మరణించిన వ్యక్తి వివరాలు, మరణ ధ్రువపత్రం, భార్య వివరాలను సచివాలయంలో అందజేసి ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. 2024 నవంబరు నుంచి మరణించిన వారి భార్యలకు కూడా ఈ పింఛను వర్తిస్తుంది.

 

అయితే, కొన్ని దరఖాస్తులను అధికారులు తిరస్కరించారు. 'ముందుగానే భార్య పింఛను పొందడం, భార్యాభర్తలు ఇద్దరూ చనిపోవడం, హౌస్‌హోల్డ్‌ మ్యాపింగ్‌లో భార్యాభర్తలు ఇద్దరూ ఒకేచోట లేకపోవడం, మరణ ధ్రువపత్రం అందించకపోవడం, ప్రభుత్వ ఉద్యోగం కలిగి ఉండడం, అందుబాటులో లేకపోవడం, సాంకేతిక కారణాలు, భార్య మళ్లీ పెళ్లిచేసుకోవడం' వంటి కారణాల వల్ల దరఖాస్తులు తిరస్కరించినట్లు అధికారులు తెలిపారు. పింఛన్ దరఖాస్తుకు సంబంధించి.. తిరస్కరణకు గల కారణాలను ప్రతి దరఖాస్తుకు జత చేశారు. ఇకపై భర్త చనిపోయిన భార్యలకు ఆ మరుసటి నెల నుంచే పింఛన్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.

 

ఇది కూడా చదవండి: ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. రూ.1400 కోట్లతో..! ఆ రూట్లోనే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

వారికి తక్కువ వడ్డీకే రూ. 3 లక్షలు! ఇది మీకు తెలుసా?

 

ఏపీలో తల్లికి వందనం పథకం..! ఈ చిన్న పని చేయకపోతే రూ.15వేలు కట్, తెలుసుకోండి!

 

అన్నదాత సుఖీభవ పథకం.. ఎవరు అర్హులు! ఎలా దరఖాస్తు చేసుకోవాలి!

 

ఏపీలోని ఆ రెండు నగరాలకు పండగే! 95 ఎలక్ట్రిక్ బస్సులు, తీరనున్న కష్టాలు!

కొన్ని గంటల్లోనే టీడీపీ అకౌంట్లోకి వచ్చి పడిన రూ.17 కోట్లు! అసలు విషయం ఏమిటంటే?


గూగుల్ క్రోమ్ వాడేవారికి కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక! ప్రమాదకరమైన లోపాలు గుర్తింపు!


వల్లభనేని వంశీకి హైకోర్టులో ఎదురుదెబ్బ...! అత్యవసర విచారణకు నిరాకరణ!


విశాఖ నుంచి ఈ మూడు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు! హాల్ట్ స్టేషన్లు..!


తీపి క‌బురు చెప్పిన ఫ్లిప్‌కార్ట్..! ఈ ఏడాది 5 వేల ఉద్యోగాల భ‌ర్తీ!


కొడాలి నానిని చూసేందుకు ఎవరూ రావద్దు! నాని కుటుంబ సభ్యులు!


కేటీఆర్‌కు ఏసీబీ షాక్..! నోటీసులు జారీ!


విశాఖ విమ్స్ లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల! రాతపరీక్ష లేకుండా నేరుగా ఉద్యోగం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #AndhraPravasi #APPensionScheme #NewPensions2024 #Rs4000Pension #AndhraPradeshGovt #WelfareForWidows #SpousePension